అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలను దుర్వినియోగం చేసేలా భారత్ వ్యవహరిస్తోంది: ట్రంప్

58చూసినవారు
అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలను దుర్వినియోగం చేసేలా భారత్ వ్యవహరిస్తోంది: ట్రంప్
అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలను దుర్వినియోగం చేసేలా భారత్ వ్యవహరిస్తోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఓ ప్రచార సభలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మాట్లాడుతూ భారత్- అతి పెద్ద దుర్వినియోగదారు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూనే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ 'అద్భుతమైన వ్యక్తి' అని అన్నారు. వచ్చే వారం ఆయనను కలుస్తానని చెప్పారు. సెప్టెంబర్ 21-23 మధ్య ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్