టీమిండియా టీ20 వరల్డ్కప్ జట్టుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తన జట్టును ప్రకటించడంతోనే రిస్క్కు సిద్ధమైందని అన్నారు. స్పిన్నే ఎక్కువగా నమ్ముకుంది. ఆసీస్కు భిన్నంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. కరీబియన్ పరిస్థితుల్లో స్పిన్ను ఎదుర్కోవడంపైనే భారత జట్టు విజయాలు ఆధారపడి ఉంటాయి. వరల్డ్ కప్ను నెగ్గాలనే జట్లకు టీమిండియానే పెద్ద ముప్పు అని క్లార్క్ తెలిపారు.