అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా ఆ దేశ పౌరులుగా పౌరసత్వం పొందారు. ఈ మేరకు కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ ‘అమెరికా నేచురలైజేషన్ పాలసీ’ నివేదికలో పేర్కొంది. పౌరసత్వం పొందుతున్న విదేశీయుల్లో మెక్సికో తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండోస్థానంలో నిలిచింది.