ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో స్థానం సాధించింది. గతనెల షాంఘై టోర్నీలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన సురేఖకు కాంపౌండ్ ర్యాంకింగ్లో మూడోస్థానం తృటిలో చేజారింది. అయితే సురేఖ 4, పర్ణీత్ కౌర్ 8, అదితి స్వామి 15వ స్థానాల్లో నిలవడంతో మొత్తంగా భారత్కు రెండో స్థానం దక్కింది.