రక్షణ ఉత్పత్తుల్లో భారత్ రికార్డు సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్లో రూ.1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు జరిగినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 2022-23తో పోలిస్తే ఏకంగా 16.8% పెరిగినట్లు తెలిపారు. ఆత్మనిర్భరత లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రధాని ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ ఘనత సాధించినందుకు రక్షణ శాఖకు ప్రధాని అభినందనలు తెలిపారు.