సీఎం బీరెన్ సింగ్ రాజీనామా తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం విధించింది. దీంతో అల్లర్లను అదుపులో పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. వీధుల్లో రాత్రి వేళ సైనిక వాహనాలు తిరుగుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 మే 3 నుంచి మొదలైన ఘర్షణల్లో 258 మంది చనిపోయారు. ఆర్మీ రాకతో అయినా మణిపూర్లో శాంతి నెలకొంటుందని పలువురు భావిస్తున్నారు.