విశాఖపట్నం కేజీహెచ్లో జీబీఎస్తో ఎల్. కోట మండలం మల్లివీడుకు చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందిందన్న ప్రచారాన్ని ఆ ఆసుపత్రి సూపరింటెండ్ శివానందం కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయని, ఎవరూ మరణించలేదని ఆయన స్పష్టం చేశారు.