భారత్తో తమ బంధం విలువైనదని
అమెరికా తెలిపింది. ఆ దేశానికి అందించనున్న 31 సాయుధ డ్రోన్లతో వారి తీరప్రాంత భద్రత మరింత మెరుగవుతుందన్నారు. 4 బిలియన్ డాలర్ల విలువైన డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు అంగీకరించినట్లు
అమెరికా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇండో-పసిఫిక్లో శాంతి, స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడేందుకు భారత్ పాత్రతో కలిసి పనిచేశామని
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.