ఏఐలో సరికొత్త ఆవిష్కరణలు చేసిన అగ్రగామి 100 స్టార్టప్స్ జాబితాను ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ పేరిట ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసింది. ఈ జాబితాలో మన దేశం నుంచి 10 సంస్థలకు చోటు దక్కింది. స్వచ్ఛ ఇంధన ఆవిష్కారాలు, ఆరోగ్య సంరక్షణలో వినూత్నత, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో ప్రగతి సాధించిన సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన నెక్ట్స్వేవ్ కూడా ఈ జాబితాలో స్థానం సాధించింది.