బార్బడోస్ లోనే నిలిచిపోయిన భారత జట్టు!

74చూసినవారు
బార్బడోస్ లోనే నిలిచిపోయిన భారత జట్టు!
బార్బడోస్ కు బెరిల్ హరికేన్ (తుఫాన్) ముప్పు పొంచి ఉంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం కల్లా తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హరికేన్ ప్రభావంతో విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో టీ20WC విజేతగా నిలిచిన భారత జట్టు అక్కడే నిలిచిపోయిందని జాతీయ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. తిరిగి విమాన సేవలు ప్రారంభమయ్యే వరకు ఆటగాళ్లు అక్కడే ఉండిపోతారన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్