కేంద్రమంత్రి సురేష్ గోపి మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్ను ‘ధైర్యవంతమైన నిర్వాహకుడు' అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన 'రాజకీయ గురువులు' అని అన్నారు. కాగా.. సినీ నటుడు సురేష్ గోపి త్రిశ్శూర్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొంది కేరళలో బీజేపీ ఖాతా తెరిచారు.