ఏపీ ఉన్నత విద్యామండలిలో పని చేయకపోయినా నేరెళ్ల పీఎస్వీఎన్ మూర్తి అనే ఉద్యోగి పేరుతో గత రెండేళ్లుగా జీతాలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర పరిశోధన మండలిలో ఈయన కన్సల్టెంట్ కింద పని చేస్తున్నట్లు చూపి నెలకు రూ.50 వేలు జీతంగా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది మార్చితో ఒప్పంద గడువు ముగియడంతో 2025 ఫిబ్రవరి వరకు పొడిగించారు. పని చేయని ఉద్యోగి సర్వీసును సైతం కాగితాల్లో పొడిగించేయడం గమనార్హం.