కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై విచక్షణారహితంగా దాడి

1565చూసినవారు
కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై విచక్షణారహితంగా దాడి
మహారాష్ట్రలోని పుణెలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. 27 ఏళ్ల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్‌టేక్ చేశాడు. ఒక్కసారిగా స్కూటీ ముందు ఆపి ఆకస్మాత్తుగా ముక్కుపై పిడిగుద్దులు కురిపించడం ప్రారంభించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావమైంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్