సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆదివారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ `వికసిత్ భారత్` ఎజెండా అమలులో భాగస్వాముడిని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.