భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా గాయపడ్డాడు. ఇటీవల ఫెడరేషన్ కప్లో పాల్గొన్న చోప్రా తొడ కండరానికి గాయమైంది. దీంతో ఈ వారం చెక్ రిపబ్లిక్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని భావించిన నీరజ్ చోప్రా చివరికి గాయంతో పోటీ నుండి వైదొలగవలసి వచ్చింది. మే 28న జరిగే ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో నీరజ్ చోప్రా పాల్గొనాల్సి ఉంది. అయితే ఈవెంట్కు ఆయన అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.