సువేందు నివాసంలో తనిఖీలు.. నివేదిక కోరిన EC

78చూసినవారు
సువేందు నివాసంలో తనిఖీలు.. నివేదిక కోరిన EC
పశ్చిమ బెంగాల్ పోలీసులను EC శుక్రవారం నివేదిక కోరింది. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత సువేందు అధికారి నివాసంలో రాష్ట్ర పోలీసులు ఇటీవల అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. పోలీసుల చర్యపై ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. టీఎంసీ నేత ఇంట్లో సోదాలు చేస్తే రూ.51 కోట్లు పట్టుబడ్డాయన్నారు. కానీ సువేందు నివాసంలో పోలీసులకు డబ్బు దొరకలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్