AP: పోలింగ్ రోజున పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 1000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 400 మందిని బైండోవర్ చేశారు. 146 కేసుల్లో 1500 మందికిపైగా నిందితులను గుర్తించిన పోలీసులు.. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండటంతో భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.