కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్తో స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా ఆదివారం లడఖ్ అంతటా బంద్కు పిలుపునిచ్చారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు, లడఖ్-కార్గిల్లకు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయింపు డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు.