ఈనెల 15లోపు ఇంటర్ ఫలితాలు

586చూసినవారు
ఈనెల 15లోపు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 15వ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ నిన్నటితో ముగియగా, మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేయనున్నారు. ఇందుకు వారం రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు 10లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్