దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆదివారమే ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జును సైతం కేంద్రం ఆహ్వానించింది. దౌత్యపరమైన ఒడుదొడుకులు కొనసాగుతోన్న తరుణంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఆయన భారత్లో పర్యటిస్తారో లేదో తెలియాల్సిఉంది.