క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా టోర్నీ మొత్తం 65 రోజులపాటు జరుగనుంది. ఈ మ్యాచ్లకు దేశవ్యాప్తంగా 13 స్టేడియాలు వేదిక కానున్నాయి. ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. మార్చ్ 22న కోల్కతా వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. మే 25న అదే వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.