పాకిస్థాన్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 16 మంది దుర్మరణం పాలయ్యారు. సింధ్ ప్రావిన్స్లోని ఖైర్పూర్ సమీపంలోని రాణిపుర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది మృతిచెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. బురేవాలా నుంచి వస్తున్న బస్సు రిక్షాను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అలాగే, షహీద్ బెనజీరాబాద్ జిల్లాలోని ఖాజీ అహ్మద్ పట్టణం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్కు ప్రమాదం జరగడంతో ఐదుగురు మృతిచెందగా.. 10 మంది గాయపడ్డారు.