ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ తనను కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారని JDU నేత మొహమ్మద్ రెహాన్ ఫజల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సయ్యద్, సహ అతడి సోదరులు తనను కిడ్నాప్ చేసి కొట్టారని ఫజల్ బీహార్ లోని పూర్నియాలో ఫిర్యాదు చేశారు. దళిత మహిళకు సంబంధించిన భూ వివాదంలో తనను కిడ్నాప్ చేసి.. ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లి రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారని, తాగేందుకు నీళ్లు అడిగితే బలవంతంగా మూత్రం తాగించినట్లు ఆరోపించారు.