ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి ఎన్పీసీఐ సోమవారం నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తుంది. బ్లాక్లిస్టులో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు టోల్ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రెండింతలు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా.. అందులో తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్లిస్ట్లోకి వెళ్లిపోతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్ చెక్ చేసుకోవాలి.