తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ అదరగొట్టింది. సీఎస్కేపై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్కి చేరుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర 61, రహానే 33 పరుగులు చేశారు. చివర్లో ధోనీ(25, 13 బంతుల్లో) జడేజా(42, 22 బంతుల్లో) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 2, మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గూసన్, గ్రీన్ తలో వికెట్ తీశారు.