తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో బత్తాయి, నిమ్మ తోటలు ఎండిపోయాయి. ఏటేటా సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గుతుంటే.. ఇప్పుడు వర్షాలు లేక రైతులకు మరింత గడ్డుకాలం వచ్చింది. 15ఏళ్ల క్రితం 3.24లక్షల ఎకరాల్లో బత్తాయి, 2.20లక్షల ఎకరాల్లో నిమ్మ సాగయ్యేది. సుమారు 10లక్షల కుటుంబాలు వీటిపై ఆధారపడేవి. ఈ ఏడాది బత్తాయి సాగు లక్ష నుంచి 76వేల ఎకరాలకు తగ్గింది. నిమ్మ సాగు సైతం ఈ ఏడాది 19 వేల ఎకరాలు తగ్గింది.