యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు 1-8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు లీక్ చేశాడు. తన భార్య పేరుతో ఛానల్ ఓపెన్ చేసి ప్రశ్నలను అందులో అప్లోడ్ చేశాడు. ఇది తెలిసి ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ డైరెక్టర్ భువనేశ్వర్ సైబర్ పీఎస్లో ఫిర్యాదుచేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఉపాధ్యాయుడితో సహా అతని భార్య, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.