గాయంతో రెండో టెస్టుకు దూరమైన జడేజా మూడో టెస్టులో అదరగొట్టాడు. 198 బంతుల్లో 100 పరుగులు చేసి కీలక దశలో జట్టును ఆదుకున్నాడు. 8 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. క్రీజులోనే పాతుకుపోయిన జడ్డూ రోహిత్, సర్ఫరాజ్తో కలసి భారత ఇన్నింగ్స్ నిర్మించాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. ప్రస్తుతం భారత్ స్కోరు 315/5 (84 ఓవర్లు).