జగన్ రివర్స్ టెండర్లంటూ నిర్మాణ సంస్థను మార్చేశారు. కేంద్రం, పోలవరం అథారిటీ ఎంత చెప్పినా వినలేదు. అప్పటి కాంట్రాక్టర్ పని తీరు సంతృప్తిగానే ఉంది. మార్చాల్సిన అవసరం లేదని పోలవరం అథారిటీ చెప్పింది. కాంట్రాక్టర్ ను మారిస్తే పనులు ఆలస్యమవుతాయని కూడా హెచ్చరించింది. ఒకే పని రెండు ఏజెన్సీలు చేస్తే నాణ్యత దెబ్బతింటుందని, ఎవరినీ బాధ్యులను చేయలేమని జల్శక్తిశాఖ కార్యదర్శికి కూడా లేఖ రాశారు. ఎవరెన్ని చెప్పినా, ఎంత విన్నవించినా జగన్ వినలేదు.