‘ఎమర్జెన్సీ’ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ అధినేత శరద్ పవార్ స్పందించారు. 'లోక్సభ స్పీకర్ పదవిలో ఉన్న ఓం బిర్లా అసందర్భంగా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోంది. ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకొస్తున్నారు? రాజకీయంగా ఇలాంటి ప్రకటనలు చేయడం స్పీకర్ విధుల్లో భాగమా?' అని శరద్ పవార్ ప్రశ్నించారు.