పడిగాపులు కాస్తున్న రైతన్నలు
ఎండపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగకపోవడంతో అకాల వర్షానికి వడ్లు తడుస్తున్నాయని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కొనుగోలు కేంద్రాల వద్దనే రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతున్నారు.