రేషన్ బియ్యం పట్టివేత

65చూసినవారు
రేషన్ బియ్యం పట్టివేత
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మాచాపూర్ లోని రేణుకా రైస్ మిల్ లో గురువారం తనిఖీలు నిర్వహించినట్లు మెట్ పల్లి కోరుట్ల పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అధికారులకు రహస్యంగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో శ్రీ రేణుకా రైస్ మిల్లులో పిడిఎస్ రైస్ అక్రమంగా నిలువ చేసిన 275 సంచులలో 176. 60 క్వింటాల్ల రైస్ వాహనంతో సహా జప్తు చేసి సదరు మిల్లర్ పై 6 – ఎ కేసు నమోద చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్