పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' మూవీ ఈ నెల 7న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ నేటి రాజకీయాలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఆలోచనలను మరింత మందికి చేరవేయాలన్నదే తమ దృక్పథమని చెప్పారు. ఈ సినిమాకు అమ్ముడయ్యే ప్రతి టికెట్పై రూ.10
జనసేన పార్టీ నిధి కోసం అందజేస్తామని తెలిపారు.