ఆనాటి రోజులు గుర్తుకు తెస్తున్న క్యూ లైన్లలో పాస్ బుక్కులు

75చూసినవారు
ఆనాటి రోజులు గుర్తుకు తెస్తున్న క్యూ లైన్లలో పాస్ బుక్కులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం జోగిపేటలో జనుము, జీలుగ రైతులు జనుము, జీలుగ విత్తనాల కోసం మండుటెండలో అవస్థలు పడుతున్నారు. రాయితీ విత్తనాలు దక్కించుకునేందుకు ఉదయం నుంచి రైతులు అగచాట్లు పడుతున్నారు. క్యూ లైన్లలో పాస్‌బుక్ జీరాక్సులు ఉంచి నిరీక్షిస్తున్నారు. అయితే జనుము, జీలుగ విత్తనాలు కొద్దిగానే వచ్చాయని అధికారులు అంటున్నారు. విత్తనాల కోసం క్యూ లైన్లలో పాస్ బుక్కులు.. ఆనాటి రోజులు గుర్తుకు తెస్తున్నాయని రైతులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్