లోక్సభ స్పీకర్ పదవిపై జేడీ(యూ) ప్రతినిధి కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జేడీయూ ఎన్డీయేతోనే ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రతిపాదించిన స్పీకర్ నియామకానికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు. మరోవైపు నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి కొద్ది గంటలైనా కాకముందే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో పదవుల పంపకాలపై అసమ్మతి మంటలు ఎగిసిపడిన సంగతి తెలిసిందే.