ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. దాదాపు 2 లక్షల మంది పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది.