'కల్వకుంట్ల డ్రామారావా!'.. కాంగ్రెస్ ట్వీట్

51చూసినవారు
'కల్వకుంట్ల డ్రామారావా!'.. కాంగ్రెస్ ట్వీట్
సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తవడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ రీ ట్వీట్ చేసింది. 'కల్వకుంట్ల డ్రామారావా! 2014 లోనే రూ. 3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, మీ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేండ్లు ఆలస్యం చేస్తిరి. అందినకాడికి దోచుకుంటిరి. ప్రజా ప్రభుత్వం వచ్చాక జనవరి 7, 2024 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 6 నెలల్లో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టి పూర్తిచేశారు' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్