నేషనల్ క్రైం రికార్డులో ఏపీ మూడో స్థానం: హోంమంత్రి

54చూసినవారు
నేషనల్ క్రైం రికార్డులో ఏపీ మూడో స్థానం: హోంమంత్రి
ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత.. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని పేర్కొన్నారు. పోలీసు అకాడమీ, గ్రేహౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని నేషనల్ క్రైం రికార్డులో ఏపీని మూడో స్థానంలోకి తెచ్చారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్