గవర్నర్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఎమ్మెల్యేలు (Video)

82చూసినవారు
పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసన సభ్యులను ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్‌కు రావాలన్న గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సయంతిక బెనర్జీ, రేయత్‌ సర్కార్‌ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. స్పీకర్‌ సమక్షంలో తమతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు అసెంబ్లీకి గవర్నర్‌ రావాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ అన్నారు.

సంబంధిత పోస్ట్