తిర్మలాపూర్ లో దుర్గామాత శోభయాత్ర

679చూసినవారు
తిర్మలాపూర్ లో దుర్గామాత శోభయాత్ర
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో శనివారం ఉదయం దుర్గామాత శోభయాత్ర దుర్గామాత భక్తులు ప్రారంభించారు. ఈ శోభయాత్రలో గ్రామంలోని యువతి, యువకులు మరియు మహిళలు కోలాటం ఆటలతో, బతుకమ్మ ఆడుతూ ఊరేగింపు చేశారు. దుర్గామాత గ్రామంలోని వీధుల నుండి వెళ్తుంటే గ్రామంలోని ప్రజలు కొబ్బరికాయాలు కొట్టి, హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిన్నా రఘు రామయ్య, గ్రామ ఎంపీటీసీ మల్లారెడ్డి, గ్రామంలోని ప్రజలు ఈ శోభాయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్