కామారెడ్డి: బోర్లంలో సరస్వతి మాతగా పూజలు అందుకున్న అమ్మవారు

69చూసినవారు
కామారెడ్డి: బోర్లంలో సరస్వతి మాతగా పూజలు అందుకున్న అమ్మవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కామారెడ్డి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ భక్త మార్కండేయ మందిరం ఆవరణలో నెలకొల్పిన దుర్గామాత బుధవారం శ్రీ సరస్వతి దేవి అవతారంలో పూజలు అందుకుంది. ఈ సందర్భంగా దుర్గా సేవా సమితి సభ్యులు ఏడ వెంకటేశ్వర్లు, రాజేశ్వర్, ప్రణీత్, శ్రీనివాస్, నవీన్, భవాని దీక్ష స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

సంబంధిత పోస్ట్