బాన్సువాడ నియోజకవర్గంలో బిజెపి పార్టీ పదవులు కేవలం తమ అనుకూలమైన వారికి మాత్రమే ఇస్తూ సీనియర్లను పక్కన పెడుతున్నారని బిజెపి నాయకులు భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అర్సపల్లి సాయి రెడ్డి, డాకయ్య, ముత్యాల సాయిబాబా, రాజాసింగ్, తదితరులు పాల్గొన్నారు.