అల్లాపూర్ గ్రామంలో యాంటి లార్వా సర్వే

61చూసినవారు
అల్లాపూర్ గ్రామంలో యాంటి లార్వా సర్వే
పిట్లం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో శనివారం పిట్లం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు వైద్యాధికారి రోహిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి ఇంటికి యాంటీ లార్వా సర్వే నిర్వహించి, అవసరం ఉన్న వారి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో 95మందిని పరీక్షించి, అందులో 26మంది రక్త నమూనలను సేకరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్