పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థినిలు

76చూసినవారు
పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థినిలు
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థినిలు సత్తా చాటారు. రాజంపేట మండలంలో మొత్తం 299 మంది పరీక్షలు రాయగా 287 మంది ఉత్తీర్ణతతో 96% సాధించినట్లు ఎంఈఓ రామస్వామి తెలిపారు. తలమడ్ల పాఠశాలకు చెందిన గంగన్నగారి బృంద 9. 8, మహమ్మద్ సాదియా 9. 8 జిపిఏ, కేజీబీవీ పాఠశాలలో ఎస్. శివాని, పిఆర్ మొనాలి 9. 7 జిపిఏ సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈఓ రామస్వామి, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్