ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు

2258చూసినవారు
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బి. శరత్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ఎస్. రాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్, చిట్టిల పేరిట అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేయడం, కస్టమర్లను బెదిరించిన ఘటనలో క్రిమినల్ కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్