దేశంలోని ఆరు ఐఐటీలకు కొత్త డైరెక్టర్లు నియమితులయ్యారు. విద్యాశాఖలోని సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కాన్పుర్ ఐఐటీకి మహీంద్ర అగర్వాల్, గువాహటి ఐఐటీకి దేవేంద్ర జలిహాల్, జోధ్పుర్ ఐఐటీకి అవినాష్ కుమార్ అగర్వాల్, ధన్బాధ్ ఐఐటీకి సుకుమార్ మిశ్ర, గోవా ఐఐటీకి డీఎస్ కట్టి, ఐఐటీ- బీహెచ్యూకు అమిత్ పాత్ర నేతృత్వం వహిస్తారు.