లోక్సభ తొలిదశ ఓటింగ్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ఇవాళ తొలి దశ ఓటింగ్. గుర్తుంచుకోండి, మీ ఓటు భారతదేశ ప్రజాస్వామ్యం, రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే గత 10 సంవత్సరాలలో దేశ ఆత్మకు జరిగిన గాయాలపై మీ ఓటు అనే మందును పూసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి. ద్వేషాన్ని ఓడించండి. ప్రేమను గెలిపించండి’ అని రాసుకొచ్చారు.