సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు స్వాగతం పలికేందుకు సిబ్బంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, అందరూ వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్ కుమార్ కోరారు.