కాలనీల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పర్యటన

85చూసినవారు
కాలనీల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పర్యటన
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడ, ఇస్లాంపుర కాలనీలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మంగళవారం పర్యటించారు. వార్డుల్లో సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పూడుకుపోయిన మురికి కాల్వలను పరిశీలించి ప్రోక్లైనర్ సహాయంతో శుభ్రం చేయించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తేజపు మానస ప్రసాద్, పాత శివ కృష్ణమూర్తి, సుగుణ, మమత సాయిబాబా, చాట్ల వంశీ, జహీరా బేగం యామిన్, ఆస్మా అంజత్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్