చెరువులో పడి వ్యక్తి మృతి
ఎల్లారెడ్డి మండలం జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా చెరువులో పడి మృతి చెందారు. లింగంపేట మండలం శెట్టిపల్లి గ్రామం నుంచి 13 ఏళ్ల క్రితం జంగమయ్యపల్లి గ్రామానికి చాకలి కలవ్వ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. తన పొలం వద్ద నీరు పెట్టడానికి దామర చెరువు కట్ట పైనుంచి వెళుతుండగా గురువారం ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.